‘అర్జున్ రెడ్డి’ భామ.. బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది..!

  • January 23, 2019 / 12:08 PM IST

‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది షాలిని పాండే. మొదటి చిత్రంతోనే యూత్ ని విపరీతంగా అక్కట్టుకున్నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు ఎక్కువ రాలేదనే చెప్పాలి. ‘మహానటి’ ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘118’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ్ లో కూడా ‘100 % కాదల్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక తాజాగా ఈ బ్యూటీకి బాలీవుడ్ లో మంచి ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కుమారుడు ఆదిత్య హీరోగా పరిచయమవుతున్న ‘భాంఫాడ్’ అనే చిత్రంలో హీరోయిన్ గా షాలిని పాండేని ఎంపిక చేసుకున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని అనురాగ్ కశ్యప్ నిర్మిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సిచిత్రంతో రంజన్ చందేల్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నాడు. గత సంవత్సరంలోనే చిత్ర షూటింగ్ మొదలైనప్పటికీ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకి రానివ్వలేదు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రంతో షాలిని పాండే కి బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు వస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రంతో అయినా ఈ అమ్మడి దశ తిరుగుతుందేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus