శర్వానంద్ కి జోడీగా నటించనున్న క్రేజీ హీరోయిన్స్!

  • November 4, 2017 / 11:30 AM IST

యంగ్‌ హీరో శర్వానంద్‌ తనకు నప్పే కథలతో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా మారుతీ దర్శకత్వంలో చేసిన మహానుభావుడు కూడా మంచి విజయాన్ని అందించింది. అదే ఉత్సాహంతో సుధీర్‌ వర్మ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. స్వామి రారా, కేశవ సినిమాలతో  పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ డైరక్టర్ శర్వానంద్‌ ని కొత్తగా చూపించబోతున్నారు. త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ పోషించనున్నారు. ఆ రోల్స్ పక్కన ఇద్దరి హీరోయిన్స్ ని ఫైనల్ చేశారు. వారిలో ఒకరు మలయాళీ బ్యూటీ నివేదా థామస్‌ కాగా, అర్జున్‌ రెడ్డి సినిమాతో క్రేజీ హీరోయిన్ గా మారిన షాలినీ పాండే మరో హీరోయిన్‌గా నటించనుంది.

శర్వానంద్ సీనియర్ క్యారక్టర్ పక్కన మొదట కాజల్ ని అనుకున్నారు.. ఆమె నో చెప్పడంతో ఆ అవకాశం నివేదా కి దక్కిన్నట్లు సమాచారం.  హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ సెన్సేషన్ సృష్టించడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus