షాకింగ్ డిసిషన్ తీసుకున్న యంగ్ టైగర్!!!

  • April 5, 2017 / 06:27 AM IST

యంగ్ టైగర్ పూర్తిగా మారిపోయాడు…భారీ డైలాగ్స్…భారీ యాక్షన్ సీన్స్ మాత్రమే కాదు…పాత్రల్లో కూడా వైవిధ్యాన్ని కలిగిన పాత్రలనే ఎంచుకుంటున్నాడు…సినిమా సినిమాకు సంభంధం లేకుండా తన పాత్రను తీర్చి దిద్దుకునే ప్రయత్నంలో దూసుకుపోతున్నాడు…విషయంలోకి వెళితే….ఎన్టీఆర్ నత్తి వాడి పాత్రలో నటిస్తున్నాడట…చ్యాలెంజింగ్ పాత్రలో ఒదిగిపోనున్నాడట….విషయంలోకి వెళితే….యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జై లవకుశ’ అని అందరికీ తెలిసిందే….ఈ మూవీలో తారక్ నటించే ఒక పాత్రకు కొద్దిగా నత్తిని మేనరిజమ్ గా పెడుతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి…. ఈ సినిమాలో తారక్ నటించే పెద్దవాడైన జయ్ పాత్రకు కాస్త నెగిటివ్ షేడ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రకు నత్తిని మేనరిజమ్ గా పెట్టినట్లు గాసిప్పులు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో కధానుగుణంగా….ఎన్టీఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నారు పోసాని కృష్ణ మురళి…ఆయనకు ఇద్దరు భార్యలు….అయితే….ఆ ఇద్దరు భార్యలకు పుట్టిన ముగ్గురు పిల్లల కథ ‘జై లవకుశ’ అన్న ప్రచారం జరుగుతోంది. అదే క్రమంలో ఈ ముగ్గురు వారసుల మధ్య జరిగే ఘర్షణ వాతావరణమే ఈ సినిమా అనేది సినిమా సర్కిల్స్ లో హడావిడి చేస్తున్న న్యూస్….ఇక ఏ పాత్రనైనా తనదైన శైలిలో దుమ్ము దులిపెయ్యగల ఎన్టీఆర్ కు ఈ పాత్ర సైతం మంచి పేరు తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది….ఇక్కడ ఇంకో ట్విష్ట్ ఏంటి అంటే…ఈ నత్తి కూడ జూనియర్ కు ఆవేశం వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అన్నట్లుగా డైరెక్టర్ బాబి జూనియర్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్ బలంగా వినిపిస్తుంది…మరి ఎన్టీఆర్ సరికొత్త ప్రయోగం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus