సాహో హీరోయిన్ శ్రద్ధ ఏమి చెప్పిందంటే ?

  • October 14, 2017 / 07:04 AM IST

బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ప్రభాస్ పక్కన నటిస్తుంది అని తెలిసిన క్షణం నుంచి తెలుగు వారు.. ఆమెను తమ వ్యక్తిగా చూసుకోవడం మొదలెట్టారు. ఈ ముద్దుగుమ్మ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సాహో సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ లో మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని ముంబై వెళ్ళింది. ఇంటికి చేరగానే తమ అభిమానులకు ఒక సందేశాన్ని అందించింది. “దీపావళి వస్తోంది.. ఇది దీపాల పండగ. చీకటిని పారదోలే పండుగ. అంతేకానీ గాలి కాలుష్యం, పెద్ద శబ్దాలతో కూడుకున్నది కాదు.

గాలిని స్వచ్ఛంగా ఉంచడానికి సహకరించండి. వీధుల్లోని జంతువులను సురక్షితంగా ఉంచండి” అని ఇంస్ట్రా గ్రామ్ లో వీడియో పెట్టారు. ఈ పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ పండుగ తర్వాత సాహో నెక్స్ట్ షెడ్యూల్ ల్లో శ్రద్ధ పాల్గొననుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus