నిత్యామీనన్ స్థానంలో శృతిహాసన్..?

  • April 19, 2016 / 06:00 AM IST

నితిన్, నిత్యా మీనన్ లు కలిసి జంటగా నటించిన చిత్రం ‘గుండె జారి గల్లంతయ్యిందే’. 2013 లో విడుదలైన ఈ చిత్రం నితిన్ కు మంచి విజయాన్ని అందించింది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి.. ఇప్పుడు మళ్ళీ ఆయన దర్శకత్వంలోనే సీక్వెల్ రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సీక్వెల్ లో నితిన్ సరసన శృతి హాసన్ జంటగా నటించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఈ చిత్రం నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మించే అవకాశాలు ఉన్నాయి. తొలుత సీక్వెల్ లోనూ నిత్యామీనన్ నే నటింపజేయాలని నితిన్ చూసినప్పటికీ.. రెమ్యూనరేషన్ విషయంలో నిత్యా మంకుపట్టు పట్టిన కారణంగానే ఆమె స్థానంలో శృతి ఎంపిక జరిగిందని తెలుస్తోంది.
కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నితిన్ తాజా చిత్రం ‘అ..ఆ’ మే లో విడుదల కానుండగా.. ఈ చిత్రం విడుదలైన వెంటనే నితిన్ తదుపరి చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

https://www.youtube.com/watch?v=l7nb4lUhdhs

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus