ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతున్న సిమ్రాన్, త్రిష..!

  • February 15, 2019 / 07:05 PM IST

గతంలో కోలీవుడ్ హీరో ప్రశాంత్ నటించిన ‘జోడి’ చిత్రంలో కనిపించారు సిమ్రాన్, త్రిష. ఇటీవల ‘పేట’ చిత్రంలో రజినీ సరసన కూడా జతకట్టారు ఈ ఇద్దరు భామలు. వీరిద్దరూ యువ హీరోయిన్ల పోటీకి తట్టుకుని మరీ అవకాశాలు దక్కించుకోవడం ఆశ్చర్యకరమైన విషయం. కోలీవుడ్ తో పాటూ టాలీవుడ్ లో కూడా ఈ ఇద్దరి హీరోయిన్లకి మంచి క్రేజ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ భారీ యాక్షన్ మూవీలో సిమ్రాన్, త్రిషలు ప్రధాన పాత్రలు పోషించడానికి రంగంలోకి దిగారట.

ఈ చిత్రాన్ని విజయ్ రాఘవేంద్ర నిర్మిస్తుండగా .. సుమంత్ రాధాకృష్ణన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ మేకర్స్ హీరో జీవా తో ‘గొరిల్లా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది భారీ యాక్షన్ మూవీ కావడంతో, ఫైట్స్ చేయడంలో సిమ్రన్ .. త్రిష ఇద్దరూ కూడా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నారని సమాచారం. చెన్నై .. కేరళ .. థాయ్ లాండ్ వంటి ప్రాంతాలలో ఈ చిత్ర షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేస్తారట. ఇక ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus