అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ (Premam) తో తెలుగు యువతని ఆకర్షించింది. ఇది గ్రహించిన త్రివిక్రమ్ (Trivikram Srinivas) తన ‘అఆ’ (A Aa) సినిమాతో ఆమెను తెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ‘సితార..’ లో రూపొందిన ‘ప్రేమమ్’ (Premam) లో కూడా ఛాన్స్ ఇప్పించాడు. ఆ తర్వాత ఆమె ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) వంటి వరుస సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుని టాప్ ప్లేస్ కు చేరుకుంది. అయితే మలయాళ సినీ పరిశ్రమలో మాత్రం మొదట ఆమెకు ఎంకరేజ్మెంట్ లభించలేదట. ఈ విషయాన్ని ఆమె ఓపెన్ గానే చెప్పేసింది.
ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ (Janaki v/s State of Kerala) సినిమా త్వరలో రిలీజ్ కానుంది.దీని ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనుపమ మాట్లాడుతూ… “మలయాళంలో నన్ను రిజెక్ట్ చేసిన డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. నీకు నటన రాదు అంటూ హేళన చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. మలయాళ సినిమాల్లో నాకు చిన్న చిన్న పాత్రలు మాత్రమే ఇచ్చారు.
కానీ దర్శకుడు ప్రవీణ్ (Pravin) నన్ను నమ్మి ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాలో నాకు పవర్ఫుల్ రోల్ ఇచ్చారు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అక్కడే ఉన్న నటుడు సురేష్ గోపి (Suresh Gopi).. అనుపమ (Anupama Parameswaran) కామెంట్స్ కి చలించిపోయాడు.ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. ” అనుపమ మనసులో ఉన్న బాధని ఆమె మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అనుపమ (Anupama Parameswaran) మాత్రమే కాదు గతంలో సిమ్రాన్ (Simran) విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమెను మలయాళ సినీ పరిశ్రమ చిన్న చూపు చూసింది.
కానీ తర్వాత ఆమె టాప్ హీరోయిన్ అయ్యాక.. నాకు తెలిసిన టాప్ డైరెక్టర్లు ఆమె డేట్స్ కావాలని వెంటపడేవారు. ఆసిన్ (Asin Thottumkal),నయనతారని (Nayanthara) విషయంలో కూడా ఇదే జరిగింది. వేరే భాషల్లో వాళ్ళు టాప్ ప్లేస్లోకి వెళ్ళాక మాత్రమే వాళ్ళని పట్టించుకున్నారు. ఇప్పుడు అనుపమ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను. నా ఆశీస్సులు ఆమెకు ఎప్పుడూ ఉంటాయి” అంటూ నటుడు సురేష్ గోపి అనుపమని దీవించారు. ప్రస్తుతం వీళ్ళ కామెంట్స్ వైరల్ గా మారాయి.