నా భర్త, కొడుకుని వదిలెళ్ళిపోతానేమోనని భయమేసింది : సోనాలి బింద్రే

  • May 3, 2019 / 01:43 PM IST

‘మురారి’ ‘ఇంద్ర’ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ‘ఖడ్గం’ ‘మన్మధుడు’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సోనాలి బింద్రే తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితమే. అందంతో పాటూ నటనతో కూడా ఈమె ప్రేక్షకులని మెప్పించింది. అయితే ఈమె గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని ఈమధ్యే ఇండియాకి తిరిగి వచ్చింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి.. తనకి క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యింది..అనే విషయాల్ని చెప్పుకొచ్చింది.

ఈ విషయం పై సోనాలి బింద్రే మాట్లాడుతూ… “నాకు హైగ్రేడ్ క్యాన్సర్ ఉందని తెలిసిన రోజు.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను, ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. నా భర్త, కొడుకుని వదిలి వెళ్ళిపోతానేమో అని చాలా భయమేసింది. ఆ రాత్రి ఎంతో ఒత్తిడికి గురయ్యాను. ఆ తరువాత నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఇంకెప్పుడూ ఏడవకూడదని, బాధపడకూడదని నిర్ణయించుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ఎంతో ఆనందంగా ఉన్నాను. నా సంతోషానికి నా భర్త, కొడుకు కూడా కారణం. నా కొడుకు ఎంతో పరిణతితో ఆలోచించాడు.. వాడికి చిన్న వయసే అయినా ఎంతో ధైర్యంగా, పరిపక్వత చూపించాడు. కొడుకును బాధపెట్టకూడదనే ఉద్దేశంతో నవ్వుతూనే ఉన్నాను. ఇక పైనా అలాగే ఉంటాను. జీవితంలో నన్ను బాగా చూసుకునే వ్యక్తి నా భర్తే” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus