ఇదివరకంటే ఈ మీటూ అనేది లేదు కాబట్టి సందు దొరికినప్పుడల్లా ప్రొడ్యూసర్ నుంచి ఆఫీస్ బాయ్ వరకూ ప్రతి ఒక్కడు హీరోయిన్ లేదా సెట్ లో ఉన్న లేడీస్ ను తెగ గోకేసేవారు. కానీ.. ఈ స్మార్ట్ ఫోన్స్ పుణ్యమా అని టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఆ గోకడాలు కాస్త తగ్గాయి. కానీ.. ఈ “మీటూ” రచ్చ మొదలైనప్పట్నుంచి అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కనీసం మెసేజులు పెట్టడానికి కూడా భయపడుతున్నారు ఎక్కడ స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టి అల్లరి చేస్తారో అని భయపడేవారి సంఖ్య పెరిగింది. దాంతో కుదురుగా ఉండడం మొదలెట్టారు.
మరి ఈ విషయాలనీ తెలియదో లేక సదరు నటి సీరియస్ గా తీసుకోదు అనుకున్నాడో ఏమో కానీ.. ఇటీవల నేహా సక్సేనా అనే నటీమణి దుబాయ్ కి ఏదో ఈవెంట్ అటెండ్ అవ్వడం కోసం వెళ్లినప్పుడు.. ఓ ప్రభుద్ధుడు ఆమె మ్యానేజర్ కు “ఈమె ఒన్ నైట్ స్టాండ్ కు వస్తుందా?” అని అడిగాడు. ఈ విషయమై కాస్త ఘాటుగానే స్పందించింది నేహా సక్సేనా. వెంటనే ఆ ప్రభుద్ధుడి ఫోటోలు మరియు చాట్ ను స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్ లో పెట్టేసింది. తనకు ఓ బహిరంగ క్షమాపణ లేఖ రాసేవరకూ ఆ పోస్ట్ డిలీట్ చేయను అని కూడా చెప్పేసిందట. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడట ఆ అబ్బాయి. అందుకే.. అనవసరంగా ఎవర్నీ గెలక్కూడదు అనేది.