క్లైమాక్స్ ఫైట్ ని మొదలెట్టిన మహేష్ బాబు

  • May 3, 2017 / 11:41 AM IST

తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగ దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పైడర్ మూవీ చివరి షెడ్యూల్ మొదలయింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడాలోని పోలీస్ క్వార్ట్రర్స్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. తెలుగు, తమిళ అభిమానులకోసం డైరక్టర్ రెండు క్లైమాక్స్ ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందుకే ఈ షెడ్యూల్ ఈ నెల చివరి వరకు కొనసాగుతుంది. ఈ ఫైట్ కంప్లీట్ అయితే రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది.

అందుకోసం చిత్ర బృందం జూన్ లో విదేశాలకు వెళ్లనుంది. ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా ఎస్.జె సూర్య, హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus