తమిళనాడులో అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ కానున్న స్పైడర్!

  • September 20, 2017 / 06:59 AM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న “స్పైడర్” పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమా ఈనెల 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అమెరికాలో 800 వందల స్క్రీన్స్ లలో సినిమాని ప్రదర్శించడానికి అట్మాస్ ఎంటర్టైన్మెంట్ వాళ్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బాహుబలి కంక్లూజన్ అమెరికాలో వెయ్యి స్క్రీన్ లలో రిలీజ్ అయింది. ఆ తర్వాత అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కాబోతున్న మూవీ స్పైడర్ కావడం విశేషం. అలాగే తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తమిళనాడులో మొదటిరోజు సుమారు 450కు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది. మహేష్ కి ఇది తమిళంలో తొలి సినిమా అయినప్పటికీ అక్కడ క్రేజ్ బాగానే ఉంది. మురుగదాస్ దర్శకత్వం స్పైడర్ పై హైప్ రావడానికి ప్రధాన కారణం అయింది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా అనేక రికార్డులను తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus