దాసరి మృతి కారణంగా ఒక రోజు ఆలస్యంగా వస్తున్న స్పైడర్ టీజర్

  • May 31, 2017 / 06:11 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్  షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది.  ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజైన ఈరోజు (మే 31 ) రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం అనుకుంది. అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు నిన్న మరణించడంతో చిత్ర పరిశ్రమ మూగబోయింది. సినీ పరిశ్రమను ఆరాధించే కళ్లలో కన్నీటి ఛాయలు అలుముకున్నాయి. ఈ సందర్భంలో టీజర్ రిలీజ్ ని చిత్ర బృందం వాయిదా వేసింది. రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం చెన్నైలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది.

ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా, తమిళ దర్శకుడు ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పీ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ వందకోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus