శ్రీముఖి కళ చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

  • March 12, 2021 / 03:21 PM IST

బుల్లితెర యాంకర్ గా దూసుకుపోతున్న శ్రీముఖి.. తన చలాకీతనంతో టీవీ షోలను రక్తి కట్టిస్తుంటుంది. కేవలం యాంకర్ గానే కాకుండా నటిగా కూడా తన టాలెంట్ నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో కొన్ని చిత్రాలలో కూడా నటిస్తోంది. అలానే బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని తన పాపులారిటీ మరింత పెంచుకుంది. చివరి వరకు గేమ్ లో ఉండి రన్నరప్ గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఆమెలో మంచి యాంకర్ మాత్రమే కాకుండా ఓ ఆర్టిస్ట్ కూడా ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

మహాశివరాత్రి సందర్భంగా రాత్రంతా జాగారం చేసింది శ్రీముఖి. అయితే ఆ సమయాన్ని వృథా చేయకుండా మంచి బొమ్మను చిత్రీకరించానని.. సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. పరమ శివుడు బొమ్మను చిత్రీకరించి.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. శివుడి బొమ్మను చాలా బాగా గీసావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖిలో ఇంత టాలెంట్ ఉందా..? అంటూ మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

మొత్తానికి తనలో చిత్రకారిణి ఉందని నిరూపించుకుంది శ్రీముఖి. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీముఖితో పాటు సింగర్ మనో, భరణి శంకర్, రాజా రవీంద్ర కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus