మెగా ఫ్యామిలీపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • July 6, 2018 / 12:29 PM IST

ఎన్నిసార్లు వివాదాల్లోకి ఇరుక్కున్నా.. సారీలు చెప్పుకున్నా మళ్లీ అదే విధంగా నటి శ్రీ రెడ్డి విమర్శలు చేస్తోంది. ఇదివరకు పవన్ కళ్యాణ్ పై ప్రత్యక్షంగా విమర్శలు చేసి పెద్ద గొడవకి కారణమయింది. మళ్ళీ మెగా హీరోలపై విమర్శలు గుప్పించింది. “మెగా ఫ్యామిలిలో గుడ్లు ఇంకెన్ని పిల్లలవుతాయో. ఇప్పటికే తేనెపట్టులా కుప్పలు తెప్పలుగా అయిపోయి గందరగోళం చేస్తున్నారు. పిల్లలు అయిపోయి ఇప్పుడు అల్లుళ్ళు రంగంలోకి వచ్చారు” అంటూ మెగా కుటుంబం నుంచి ఎక్కువమంది హీరోలు వస్తున్నారని శ్రీరెడ్డి సెటైర్ వేసింది. ఈ సారి పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా విమర్శలు చేసింది. “సినిమాల్లో ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నారు.

అవగాహనలేని వారంతా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ కూడా తినేయండి” అంటూ పోస్ట్ చేసింది. “మీ కాళ్ల దగ్గర యూత్ అంతా ఫ్యాన్స్ లా పడి ఉండాలి. వాళ్లు మాత్రం ఎప్పటికి హీరోలు కాలేరు. ఆ విషయం ఫాన్స్ కి అర్థం కావడం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే ఫ్రెష్ హీరోలకు మాత్రమే తన సపోర్ట్ ఉంటుంది ” అని శ్రీరెడ్డి తెలిపింది. చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబాలు కొత్తవారిని ప్రతిభని తొక్కేస్తున్నాయని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. మరి ఈ కామెంట్లు ఎన్ని వివాదాలకు కారణం అవుతాయో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus