కూతురుపై కసురుకున్న శ్రీదేవి

  • February 8, 2018 / 07:30 AM IST

‘ఎంత మహాబలుడైనా, అమ్మ ఒడి పసివాడే’ అంటూ బాహుబలిలో తల్లిప్రేమ గురించి ఎంతో అందంగా వివరించారు. సో పిల్లలు ఎంతపెద్దవారైనా సరే తల్లిదండ్రులకి మాత్రం వారు బుడతలే. అందుకే ఒక్కోసారి పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులకు కూడా వయసుతో సంబంధం లేకుండా సీరియస్ అయిపోతుంటారు తల్లిదండ్రులు. ఆ కోపంలోని ప్రేమను అర్ధం చేసుకోగలిగితే అభిమానం పెరుగుతుంది, లేదంటే మాత్రం అపశ్రుతులు దొర్లే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అయితే.. ఉన్నట్లుండి తల్లిప్రేమ గురించి ఎందుకు చెప్పుకొచ్చామంటే.. ఇటీవల ముంబైలో జరిగిన ల్యాక్మీ ఫ్యాషన్ వాక్ కి జంటగా హాజరైన శ్రీదేవి, ఆమె తనయ జాన్వి కపూర్ లు అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షించారు. ముఖ్యంగా ఇద్దరూ చూడ్డానికి అక్కాచెళ్లెళ్ళ వలె కనిపించడం విశేషం.

అయితే.. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు రెడ్ కార్పెట్ వద్ద శ్రీదేవి, జాన్వి కపూర్ ల ఫోటోలు తీయడానికి ఎగబడ్డారు. ఇద్దరినీ జంటగా ఫోటోలు తీసిన ఫోటోగ్రాఫర్లు, తర్వాత సింగిల్ స్టిల్స్ కూడా తీసుకొన్నారు. అయితే.. జాన్వి కపూర్ సింగిల్ గా ఇస్తున్న స్టిల్ ఫోజులు శ్రీదేవి నచ్చలేదట. ముందు కళ్ళతో సైగ చేసినప్పటికీ జాన్వి పట్టించుకోకపోవడంతో ఆమెను అక్కడే వదిలేసి సీరియస్ గా ఆమె ఫోన్ లాక్కొని వెళ్లిపోయిందట. దాంతో తల్లి చర్యకి షాక్ అయిపోయిన జాన్వి సైలెంట్ గా ఆమెను ఫాలో అవుతూ వెళ్లిపోయిందట. ఈ గొడవను చాలా సైలెంట్ గా గమనించిన బాలీవుడ్ మీడియా “శ్రీదేవి హిందీ సినిమాలు చేస్తున్న కొత్తలో కూడా ఆమె తల్లి ఇలాగే కంట్రోల్ చేసేది. ఇప్పుడు శ్రీదేవి కూడా తన కూతురు జాన్వి విషయంలో అదే ఫార్మాట్ ను ఫాలో అవుతుంది” అనుకొన్నారట. ప్రస్తుతం శ్రీదేవి సీరియస్ గా జాన్వి కపూర్ ను వారిస్తున్న ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus