తొలి సినిమాతో జాన్వీ ఎంత మేర మెప్పించింది?

  • July 19, 2018 / 01:38 PM IST

దక్షిణాది, ఉత్తరాది అని తేడా లేకుండా యావత్తు భారతీయ సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి శ్రీదేవి. ఆమె కూతురు జాన్వీ హీరోయిన్ గా పరిచయమవుతుంటే అందరి కళ్లు ఆ సినిమాపై ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరాఠిలో హిట్ అయిన సైరట్ మూవీ రీమేక్ దఢక్ సినిమాతో జాన్వీ  హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన ఈ చిత్రం రేపు థియేటర్లోకి రానుంది. ఈరోజు బాలీవుడ్ సెలెబ్రెటీల కోసం దఢక్ మూవీ స్పెషల్ షో వేశారు. సోనమ్ కపూర్, అనిల్ కపూర్ తో పాటు కరణ్ జోహర్, అనన్య పాండే, వరుణ్ ధావన్ తదితరులు ఈ సినిమాని చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

’’ఇప్పుడే జాహ్నవి, ఇషాన్ స్టార్స్ అయిపోయారు. తెరపై వారి లవ్, యాక్షన్ అందరి మనసులు దోచుకుంటుంది. అందరికీ నచ్చే సినిమా’’ అని అనిల్ కపూర్ ప్రశంసలు గుప్పించారు. “జాన్వీ ఎంట్రీ అదిరిపోయింది. చాలా గర్వంగా ఉంది. ఇషాన్ ఆకట్టుకున్నాడు. వీరిని తెరపై బాగా చూపించిన దర్శకుడు శశాంక్ కు కృతజ్ఞతలు. స్క్రీన్ మీద జంటను చూస్తే ఆశ్చర్యపోతారు” అని సోనమ్ కపూర్ ట్వీట్ చేశారు. వీరు మాత్రమే కాదు సినిమాని చూసిన బాలీవుడ్ సెలబ్రిటీలు… బాలీవుడ్ కి తల్లి(శ్రీదేవి)లేని లోటును తీర్చేలా జాన్వీ నటన ఉందని కీర్తిస్తున్నారు. మరి రేపు ప్రేక్షకులు సినిమా చూసి ఎటువంటి రివ్యూ లు ఇస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus