‘వైజయంతీ మూవీస్’ సంస్థలో ఒక హీరో డెబ్యూ ఇస్తున్నాడు అంటే.. అతనిపై అలాగే ఆ సినిమాపై అంచనాలు ఏర్పడతాయి. ఎందుకంటే ఈ బ్యానర్లో హీరోగా లాంచ్ అయిన మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారంతా టాప్ స్టార్స్గా ఎదిగారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ కూడా ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్లోనే హీరోగా లాంచ్ అవుతున్నాడు.
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో జయకృష్ణ హీరోగా నటించిన ‘శ్రీనివాస మంగాపురం'(Srinivasa Mangapuram) సినిమా ఈ జూలై 30న విడుదల కానుంది. గతంలో ఇదే డేట్కి మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మహేష్ బాబుకి బెస్ట్ డెబ్యూ లభించింది. ఆ సెంటిమెంట్ జయకృష్ణకి కూడా కలిసొస్తుందని అంతా భావిస్తున్నారు.ఆల్రెడీ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న తన సన్నిహితులకు చూపించారట అశ్వినీదత్ అండ్ టీం.
సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. వారి టాక్ ప్రకారం.. సినిమా రన్ టైం 2 గంటల 35 నిమిషాల నిడివి కలిగి ఉంటుందట. ఫస్ట్ హాఫ్లో.. ఓ యాక్షన్ ఎపిసోడ్తో సినిమా మొదలవుతుందట. అటు తర్వాత ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ అవుతుంది అంటున్నారు. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకునే విధంగా ఉందట. యాక్షన్ సన్నివేశాల్లో బాగా చేశాడంటున్నారు. అలాగే డాన్సులు కూడా బాగా వేశాడని తెలిపారు.
హీరోయిన్ రషా తడాని గ్లామర్ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందట. ఆమె క్యారెక్టర్ని కూడా దర్శకుడు అజయ్ భూపతి బాగా డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. మోహన్ బాబు రోల్ కూడా సినిమాకి హైలైట్ అంటున్నారు. అలాగే స్టార్ క్యాస్టింగ్ చాలా ఉంతుందంటున్నారు. అజయ్ భూపతి అన్ని సినిమాల్లో మాదిరే.. ఈ సినిమాలో కూడా క్లైమాక్స్లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట. అది ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని చెబుతున్నారు. మరి రిలీజ్ రోజు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.