ప్రొడ్యూసర్స్ పై ‘మీర్జాపూర్’ నటుడు ఫైర్!

  • February 28, 2023 / 11:47 PM IST

‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు నటుడు పంకజ్ త్రిపాఠి. ఆయన తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా వర్క్ చేశారు. కానీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ తోనే ఆయన ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఈ నటుడు తను నటించిన ఓ సినిమాకి సంబంధించిన నిర్మాతలపై కేసు ఫైల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఐదేళ్ల క్రితం పంకజ్ త్రిపాఠి ‘అజంగఢ్’ అనే సినిమాలో నటించారు.

టెర్రరిజంపై తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన యువకులను తీవ్రవాదం వైపు నడిపించే ఓ పాత్ర పోషించారు. కమలేష్ కే మిశ్రా దర్శకతం వహించిన ఆ సినిమా అప్పట్లో పలు కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. అయితే ఇన్నేళ్ల తరువాత ఆ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో గెస్ట్ రోల్ పోషించిన పంకజ్ త్రిపాఠి పేరుని ప్రమోషన్స్ కోసం వాడుకుంటున్నారు. పలు పోస్టర్స్ పై ఆయన ఫొటోని ప్రచురించి సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం పంకజ్ త్రిపాఠికి ఉన్న పాపులారిటీని వాడుకోవాలని చూస్తున్నారు. ఈ విషయం పంకజ్ కి నచ్చలేదు. దీంతో ఆయన నిర్మాతలపై కోపంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘ఓ మై గాడ్2’ సినిమాలో నటిస్తున్నారు. ‘అజంగఢ్’ ప్రమోషన్స్ వలన ‘ఓ మై గాడ్2’ సినిమా ఎఫెక్ట్ అవుతుందేమోనని పంకజ్ త్రిపాఠి భావిస్తున్నారు. అలానే తన పర్మిషన్ లేకుండా ఇలాంటి చీప్ పబ్లిసిటీ చేయడం నచ్చకపోవడంతో నిర్మాతలతో మాట్లాడి.. వారు ఒప్పుకోకపోతే గనుక కేసు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus