రెండు రోజులు నరకం అనుభవించా.. పవన్ హీరోయిన్ కామెంట్స్!

  • May 4, 2021 / 05:06 PM IST

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ కరోనా వెంటనే ఎటాక్ చేస్తోంది. వైరస్ బాధితులతో హాస్పిటల్స్ అన్నీ నిండిపోయాయి. చాలా మంది రోగులకు ఆక్సిజన్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మృత్యువాత పడ్డారు. సినీ తారలపై కూడా ఈ ప్రభావం గట్టిగా ఉంది. ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా నటి కృతి ఖర్బందా ప్రస్తుత పరిస్థితులు తనపై ఎలా ప్రభావం చూపిస్తున్నాయో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

గత రెండు రోజులుగా తను, తన కుటుంబ సభ్యులు ఎంతో నరకం అనుభవించామని.. మీకు అనుభవం అయ్యే వరకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదని.. కాబట్టి దయచేసి అందరూ ఇంటి నుండి బయటకి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండని తెలిపింది. ఇంట్లో ఉండే సుఖం అందరికీ దక్కదని.. మీ ప్రాణాలను, జీవితాన్ని లైట్ తీసుకోవద్దని సూచించింది. అయితే ఈ ట్వీట్ లో తనకు కోవిడ్ వచ్చినట్లు అమ్మడు స్పష్టంగా చెప్పలేదు. కానీ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆమెకి వైరస్ సోకిందని భావిస్తున్నారు.

తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ‘తీన్ మార్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘ఒంగోలు గిత్త’, ‘మిస్టర్ నూకయ్య’ వంటి సినిమాల్లో నటించింది. ఆ తరువాత కన్నడ, హిందీ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే సెటిల్ అయింది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus