సరైన హిట్టు కోసం తన సినిమా తానే ప్రొడ్యూస్ చేసుకుంటుంది!

  • October 16, 2024 / 06:15 AM IST

హీరోలకు మేమేమీ తక్కువ కాదు అని హీరోయిన్లు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. అప్పట్లో భానుమతి, సావిత్రి లాంటి సీనియర్ హీరోయిన్లు మొదలుకొని ప్రస్తుత తరం కథానాయికలైన తాప్సీ, అనుష్క శర్మ, కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, నిహారిక కొణిదెల వంటి వారందరూ నిర్మాతలుగా మారి తమ సత్తా చాటుకున్నవారే. ఇప్పుడు ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ కూడా చేరింది. ఆమే కృతి సనన్ (Kriti Sanon) . తెలుగులో మహేష్ బాబు హీరోగా రూపొందిన “ఒన్ నేనొక్కడినే” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కృతి అనంతరం తెలుగులో నాగచైతన్య సరసన “దోచేయ్” అనే సినిమాలో నటించింది.

Kriti Sanon

ఆ తర్వాత మళ్లీ తెలుగులో “ఆదిపురుష్”లో తప్ప మరెక్కడా కనిపించలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. అయితే.. ఆమెకు ఈమధ్యకాలంలో సరైన హిట్ దొరకలేదు. కృతిసనన్-టబు-కరీనా కాంబినేషన్ లో వచ్చిన “క్రూ” ఒక్కటే ఆమెకు ఈమధ్యకాలంలో దొరికిన హిట్. అయితే.. కృతి సనన్ ఇప్పుడు “దో పత్తి” అనే సినిమాతో నిర్మాతగా మారింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ కోసం నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది.

కృతి సనన్ మొదటిసారి డబుల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రంలో కాజోల్ మరో కీలకపాత్ర పోషిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కనికా థిల్లాన్ కథ అందిస్తూనే నిర్మాణ భాగస్వామిగానూ వ్యవహరిస్తోంది. మరి ఈ సినిమాతోనైనా కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ లో తన సత్తా చాటుకుని హిట్ కొడుతుందో లేదో చూడాలి. ఎందుకంటే.. ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన ఆఖరి చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “మిమి” కావడం గమనార్హం.

కలెక్షన్ల పంచాయితీ తేలలేదు.. స్క్రిప్ట్‌ పంచాయితీ మొదలైంది.. ఎందుకీ రచ్చ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus