Actress: ఆ క్రికెటర్ ను పిచ్చిగా ప్రేమించాను.. గతాన్ని తలుచుకుని హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

  • May 13, 2023 / 12:53 AM IST

సెలబ్రిటీల ప్రేమ వార్తల గురించి అందరికీ ఆసక్తి ఎక్కువ. వారి అభిమానులకు అయితే ఆ డోస్ ఇంకాస్త ఎక్కువే ఉంటుందని చెప్పాలి. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ అందరికీ సుపరిచితమే. సత్యదేవ్ హీరోగా నటించిన ‘గడ్ సే’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అందువల్ల ఈమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు. తమిళంలో మాత్రం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో (Actress) ఈమెకు వరుస ఆఫర్లు క్యూలు కట్టాయి. ఇటీవల వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్ -2’ కూడా సూపర్ హిట్ అవ్వడం ఈమెకు మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి. అయితే ఈమె గతంలో ఓ క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు తెలిపి అందరికీ షాకిచ్చింది. కానీ ఈమె హీరోయిన్ అయినప్పుడు కాదట చదువుకునే రోజుల్లో..! ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. ‘నాకు టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టం.

6 వ తరగతి నుండీ 12వ క్లాస్ చదువుతున్న టైమ్ లో యువరాజ్ ను పిచ్చిగా ప్రేమించాను. కానీ తర్వాత అతనికి పెళ్లయిపోయింది. ఇప్పుడు క్రికెట్ చూడటానికే టైమ్ కూడా నాకు లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. యువరాజ్ సింగ్ హెజిల్ కిచ్ అనే నటిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఐశ్వర్య లక్ష్మీ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus