శ్రీదేవి చివరి చూపుకోసం ముంబై వెళ్లిన చిరు, వెంకటేష్, నాగార్జున

  • February 26, 2018 / 07:41 AM IST

చిన్ననాటి నుంచి సినిమానే శ్వాసగా బతికిన శ్రీదేవి శనివారం దుబాయ్ లో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె మరణ వార్త తెలుగు, తమిళం, హిందీ చిత్ర పరిశ్రమని విషాదంలో ముంచివేసింది. శ్రీదేవి ఇక లేరనే వార్తను కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె చివరిచూపుకోసం ఎదురుచూస్తున్నారు. ఆలా ఎదురుచూస్తున్నవారిలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలున్నారు. శ్రీదేవి భౌతికకాయం ముంబై కి ఈరోజు ఉదయం వస్తుందని భావించి టాలీవుడ్ నుంచి కొంతమంది సినీ ప్రఖులు ముంబై వెళ్లారు. వెళ్లిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున ఉన్నారు.

ఈ ముగ్గురితో కలిసి శ్రీదేవి సూపర్ హిట్ సినిమాలు చేసింది. ఆ స్నేహం తో ముగ్గురు తమ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వెళ్లారు. శ్రీదేవి అంత్యక్రియలు జరిగే వరకు అక్కడే ఉండి హైదరాబాద్ కి తిరిగి రానున్నారు. ఇక దుబాయ్ లోని మార్చురీలో ఉన్న శ్రీదేవి పార్థివ దేహం ఇమ్మిగ్రేషన్‌, ఎంబాల్మింగ్‌ ప్రక్రియలు పూర్తి చేసుకుంది. పోలీస్‌ క్లియరెన్స్‌, ఫోరెన్సిక్‌ నివేదికలు కూడా అందుకుంది. ఇక ముంబైకి రావడానికి మరో మూడు గంటల సమయం అవుతుందని సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus