గీత గోవిందంలో గెస్ట్ రోల్ చేసిన హీరోయిన్స్!

  • August 11, 2018 / 11:30 AM IST

అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవర కొండ మహానటి చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు. హీరోగా “టాక్సీవాలా” చేశారు. ఈ సినిమా గత నెలలోనే థియేటర్లోకి వస్తుందని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడింది. అయినా అతని అభిమానులు నిరాశ చెందడం అవసరం లేదు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్ రొమాంటిక్ లవ్ స్టోరీ గీత గోవిందం చేశారు. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో నిర్మితమైన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మికా మందన  హీరోయిన్ గా నటించింది. టీజర్, పాటలతో ఆకట్టుకున్న ఈ సినిమా ఆగస్టు 15 న రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు గెస్ట్ రోల్ పోషించినట్లు పోషించినట్లు తెలిసింది. అజ్ఞాతవాసి, నా పేరు సూర్య సినిమాలో నటించిన అను ఇమ్మానుయేల్ ఎంట్రీ చాలా సరదాగా ఉంటుందని సమాచారం. అనుతో పాటు మలయాళ కుట్టి నిత్య మీనన్ కాసేపు కనిపించనున్నట్లు తెలిసింది. ఆమె కథలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మలుపు తిరుగుతుందని టాక్. రష్మికతో పాటు ఇద్దరు హీరోయిన్లు నటించడం సినిమా విజయానికి ప్లస్ అని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus