ప్రభాస్, శ్రద్ధ కపూర్ లపై కొన్ని సీన్స్ కంప్లీట్ చేసిన సుజీత్

  • October 11, 2017 / 01:39 PM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ని గత నెల రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో ప్రారంభించారు. ఈ భారీ షెడ్యూల్ లో హీరోయిన్ శ్రద్ధ కపూర్ కొన్ని రోజుల క్రితం జాయిన్ అయింది. అమీర్ పెట్ లో వేసిన ఇంటి సెట్ లో వారిద్దరిపై రొమాంటిక్ సీన్ తెరకెక్కించారు. నిన్నటితో తొలి షెడ్యూల్ కి పేకప్ చెప్పారు. ఈ విషయాన్నీ శ్రద్ధ తన ట్విట్టర్ అకౌంట్ లో వెల్లడించారు. “గొప్ప టీమ్ తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది.

హైదరాబాద్ సొంత ఇల్లులా అనిపించింది” అని పోస్ట్ పెట్టారు. నెక్స్ట్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలుకానుంది. అక్కడ భర్తీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించనున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus