అసిస్టెంట్ ని కోల్పోయిన బాధలో సుకుమార్!

  • August 23, 2016 / 10:40 AM IST

ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకుమార్ తన అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ చైతన్య మృతిని జీర్ణించుకు లేక పోతున్నారు. ప్రతిభ గల అసిస్టెంట్ ని కోల్పోయినందుకు బాధ పడుతున్నారు. విక్రమ్ మహేష్ నేనొక్కిడినే, ఎన్టీఆర్  నాన్నకు ప్రేమతో సినిమాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు.  అల్లు అర్జున్ తో చేసిన షార్ట్ ఫిల్మ్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నటించాడు.

సుకుమార్ రచించి, నిర్మించిన కుమారి 21 ఎఫ్ చిత్రానికి డైరక్షన్ డిపార్టమెంట్ లో పనిచేసిన విక్రమ్ ఆదివారం రాత్రి కూకట్‌పల్లిలోని రెయిన్‌బో అపార్ట్‌మెంట్ మూడో అంతస్థుపై నుంచి క్రింద పడి మృతి చెందాడు. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు జారీ పడ్డాడా? అనే కోణాల్లో ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  విక్రమ్ చైతన్య సుకుమార్ తో పాటు టీమ్ అందరితో స్నేహంగా ఉండేవాడు. కొన్నిరోజుల క్రితం ఆగస్టు 8న విక్రమ్ తన పుట్టిన రోజును సుకుమార్, మిత్రులతో కలిసి జరుపుకున్నాడు. అతని మరణవార్త సుకుమార్ బృందాన్ని విచారంలో ముంచింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus