Sumanth, Supriya: కోర్టు మెట్లెక్కిన సుమంత్‌, సుప్రియ ఎందుకంటే?

  • December 18, 2021 / 12:02 PM IST

సినిమాలో ఆర్థిక వ్యవహారాలు ఒక్కోసారి చాలా ఇబ్బందులు పెడతాయి. సినిమా విడుదల విషయంలో వీటి కారణంగా ఇబ్బందులు పడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంకొన్ని సినిమాల విషయంలో సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా… ఇంకా ఆ సినిమా ఆర్థిక విషయాల్లో… కోర్టులు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలిసో, తెలియకో జరిగిన కొన్ని విషయాల వల్ల మొత్తం సినిమా బృందం, నిర్మాతలు ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి అక్కినేని వారసులు సుమంత్‌, సుప్రియ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.

సుమంత్‌ హీరోగా ‘నరుడా డోనరుడా’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న ‘విక్కీ డోనర్‌’ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్‌ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఆశించిన మేర విజయం అందుకోలేదు. దీంతో కొంతమంది ఫైనాన్సియర్లతో ఆర్థికపరమైన విషయాల్లో గ్యాప్‌ వచ్చిందని ఆ మధ్య వార్తలొచ్చాయి. తర్వాత దీని గురించి పెద్దగా చర్చలేదు. కానీ ఇటీవల ఆ సినిమా హీరో సుమంత్‌, నిర్మాత సుప్రియ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే…

‘నరుడా డోనరుడా’ సినిమాకు సుప్రియ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. సినిమా కోసం ఫైనాన్సియల్‌ సపోర్టు కోసం కొంతమంది ఫైనాన్సియర్ల దగ్గర డబ్బులు తీసుకుంటారు. అలాగే ‘నరుడా డోనరుడా’ కోసం సుప్రియ… కారుమంచి శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నారట. అయితే సుప్రియ ఆ తర్వాత ఇచ్చిన చెక్‌… బౌన్స్‌ అయ్యిందట. ఆ విషయంలో కారుమంచి శ్రీనివాసరావు ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. ఆ విషయం మీదే ఇప్పుడు సుమంత్‌, సుప్రియ కోర్టుకు వచ్చారట.

ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కోర్టుకు వీరిద్దరూ హాజరయ్యారు. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలు బయట వైరల్‌ అవుతున్నాయి. అక్కినేని వారసుల విషయంలో ఇలా జరగడం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో అక్కినేని వారసులు ఉండకపోతే బాగుంటుంది అని అనుకుంటున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus