భైరవగీత, హుషారు పోస్ట్ పోన్ తో సుబ్రమణ్యపురం సేఫ్

  • December 3, 2018 / 06:37 AM IST

తెలుగు చిత్రసీమలో చెప్పుకోదగ్గ అన్ సీజన్డ్ హీరోస్ లో సుమంత్ ఒకడు. భారీ బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో లేకపోయినా కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకోవడంతోపాటు.. డీసెంట్ ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకొన్నాడు. చాలా ఏళ్ల తర్వాత ఈమధ్యే “మళ్ళీ రావా”తో సూపర్ హిట్ సొంతం చేసుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన ఈ స్మార్ట్ స్టార్ నటించిన తాజా చిత్రం “సుబ్రమణ్యపురం” డిసెంబర్ 7న విడుదలకానుంది. నిజానికి అదే రోజున మొత్తం ఆరు సినిమాలు విడుదలకావాల్సి ఉండగా.. అందులో నుంచి ఆర్జీవీ “భైరవగీత”, “హుషారు” అనే మరో చిత్రం డిసెంబర్ 14కి పోస్ట్ పోన్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు పెద్ద అడ్డు ఏమీ కాకపోయినా.. వర్మ ఫ్యాన్స్ మరియు యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్న సినిమాలివి. ఇప్పుడు ఈ రెండు సినిమాలు తప్పుకోవడంతో.. ప్రస్తుతం బరిలో కేవలం “కవచం, నెక్స్ట్ ఏంటీ, శుభలేఖలు” సినిమాలు మాత్రమే మిగిలాయి. ఈ నాలుగు సినిమాల్లో కాస్తంత సీరియస్ ప్రిఫరెన్స్ ఇవ్వగల సినిమా “సుబ్రమణ్యపురం”. ఎక్స్ పెక్ట్ చేయని విధంగా తన సినిమాకి వచ్చిన ఈ క్రేజ్ ను చూసి సుమంత్ చాలా సంతోషపడిపోతున్నాడట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus