సందీప్ కిషన్ చిత్రానికి ప్రభాస్ సాయం?

  • July 11, 2019 / 07:14 PM IST

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. కార్తీక్ రాజు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 12 న(రేపు) విడుదల కాబోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటీకే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రమోషన్లు కూడా వివిధ వింత పద్దతులలో చేసుకుంటూ వచ్చాడు హీరో సందీప్ కిషన్. దీంతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రం పై పడింది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకి కూడా ముఖ్య అతిథులుగా నిఖిల్, సుధీర్ బాబు వంటి హీరోలు హాజరయ్యారు. ఇది సరిపోదు అన్నట్టు ఏకంగా ప్రభాస్ ను కూడా వాడేస్తున్నాడు.

ఈ చిత్రం రెండో టికెట్ ను నిఖిల్ , సుధీర్ బాబు కి అందచేసిన సందీప్ కిషన్. మొదటి టికెట్ ను ఎవరికిచ్చేది… ‘గురువారం’ చెబుతానని చెప్పాడు. దీంతో ఎవరికిస్తాడా అనే విషయం సస్పెన్సు గా మారింది. ఆ సస్పెన్సు కు తెర లేపుతూ.. కొద్ది సేపటి క్రితం సందీప్.. ఈ చిత్రం మొదటి టికెట్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శితం కాబోతున్న ఈ చిత్రం.. మొదటి టికెట్ ను ప్రభాస్ కు అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసాడు. ఇలా ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం ప్రమోషన్లలో ప్రభాస్ ను కూడా వాడేసాడు. మరి ఈ చిత్రంతో అయినా హిట్టందుకుంటాడేమో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus