సినిమా అంటే వెండితెరపై కనిపించే హంగులు, ఆర్భాటాలే కాదు.. దాని వెనుక ఎందరో నటీనటుల కష్టం, రక్తం దాగి ఉంటాయి. అభిమానులను అలరించడమే లక్ష్యంగా తెరవెనుక స్టార్స్ పడే కష్టం అందరికీ కనిపించదు. కొన్ని సార్లు తమ అభిమానులను అలరించేందుకు రిస్కీ షాట్స్ లో కూడా పాల్గొంటారు. అలాంటి సాహసాలకు పూనుకున్నప్పుడు కొన్నిసార్లు గాయపడటం కూడా జరుగుతుంటుంది. థియేటర్లలో ఆ షాట్స్ కి అభిమానులు ఈలలు వేస్తే.. ఆ కష్టాలన్నీ మర్చిపోతారు హీరోలు..!
ఆ తర్వాత సర్జెరీలు చేయించుకోవడం కూడా కామన్. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కూడా అదే చేస్తున్నాడు. ‘పెద్ది’ సినిమా కోసం రామ్ చరణ్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అభిమానులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి అతను బ్లడ్డు పెట్టేశాడు. ‘పెద్ది’ సినిమాలో చరణ్ పడ్డ కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. అయితే ఆ సినిమాలో కుస్తీ ఎపిసోడ్స్ లో చరణ్ గాయపడటం కూడా జరిగింది. సినిమా రిలీజ్ కి ఆటంకాలు కలగకుండా తన సర్జెరీని వాయిదా వేసుకుంటూ వచ్చాడు చరణ్.
అయితే ఇప్పుడు కొంత గ్యాప్ దొరకడంతో సర్జెరీకి రెడీ అయ్యాడు. అందుకోసం కోయంబత్తూర్ పయనమయ్యాడు. ఈరోజు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుండీ స్పెషల్ జెట్లో చరణ్ కోయంబత్తూర్ బయలుదేరాడు. చరణ్ కి తోడుగా చిరంజీవి, సురేఖ, ఉపాసన కూడా కోయంబత్తూర్ వెళ్ళడం జరిగింది. రేపు ఆపరేషన్ జరుగుతుంది. తర్వాత చరణ్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది.
మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.