‘అరవింద సమేత’లో తన సీన్స్ కోతపై స్పందించిన సునీల్

  • October 12, 2018 / 06:47 AM IST

హాస్యనటుడిగా మంచి పేరుతెచ్చుకున్న సునీల్ హీరోగా మారి మొదట్లో మంచి హిట్స్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన సినిమాలు… థియేటర్లోకి వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతున్నాయి. ఎంతకష్టపడ్డా హిట్ దరికిచేరడం లేదని.. తానే విజయం వద్దకు పయనించారు. అదేనండీ తన పాత కమెడియన్ ని బయటికి తెచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత సినిమా ద్వారా కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే సునీల్ అభిమానులు నిరాశ చెందారు. అతను కొంతసేపు మాత్రమే కనిపించడం నచ్చలేదు. దీనిపై సునీల్ స్పందించారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ” సినిమా తొలి కాపీ వచ్చిన తర్వాత నన్ను కమెడియన్ గా చూసుకొని ఆనందం కలిగింది.

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత నా పాత్ర తక్కువ ఉందని చాలా మంది అడిగారు. “ఇది బిర్యానీ భయ్యా.. నన్ను జీడిపప్పులా వేశారు. ఫ్రూట్ సలాడ్ చేస్తే అరటిపండులాగా వాడుతారు. బిర్యానీలో అరటిపండు వాడితే దరిద్రంగా ఉంటుంది” అని వారికీ చెప్పాను” అంటూ నవ్వులు పూయించారు. “నా మీద అభిమానంతో, స్నేహంతో… నా సీన్లే మూడు కట్ చేశారు”అని త్రివిక్రమ్ పై తీయగా నిందలు వేశారు. ఎన్టీఆర్ యాక్షన్, త్రివిక్రమ్ మాటల చాతుర్యం, జగపతి బాబు నటన.. ఇలా అనేక విషయాలు కలిసి సినిమాకి కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్టీఆర్ కి మాత్రమే కాకుండా సునీల్ కెరీర్ కి ఈ మూవీ ఎంతో ప్లస్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus