మహేష్, కైరాలపై సూపర్ సాంగ్ షూటింగ్

  • March 14, 2018 / 01:19 PM IST

కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను సినిమా ఫస్ట్ ఓత్, విజన్ ఆఫ్ భరత్ లకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా తొలి పాటను ఉగాది నాడు రిలీజ్ చేయడానికి చిత్ర బృందం భావిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలను వినడానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. కొరటాల శివ మాత్రం ఆ పాటను మరింత అందంగా చిత్రీకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన భారీ సెట్ లో మహేష్, కైరా అద్వానీలపై పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ అనంతరం యూకే కి వెళ్లనున్నారు. అక్కడ ఒక పాటని కొని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

ఆ షెడ్యూల్ తో షూటింగ్ పార్టీ కంప్లీట్ అవుతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా చేస్తూనే మరో వైపు ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. తొలిసారి ముఖ్య మంత్రిగా మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పోసాని కృష్ణమురళి పాత్ర ఇందులో నవ్వులు పూయించనున్నట్టు సమాచారం. అలాగే రాజకీయనాయకులపై కొరటాల వేసిన పంచ్ లు థియేటర్లో చప్పట్ల వర్షం కురిపిస్తుందని టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus