Surender Reddy, Ram Charan: చరణ్ గొప్పదనం చెప్పుకొచ్చిన సురేందర్ రెడ్డి!

  • January 24, 2022 / 04:18 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటూ సినిమా రంగంలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా వేర్వేరు రంగాలలో రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రెండు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. చరణ్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ధృవ సినిమా తెరకెక్కగా ఈ సినిమా భారీస్థాయిలో సక్సెస్ సాధించింది. చిరంజీవి సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమాకు చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.

సైరా నరసింహారెడ్డి షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాల గురించి సురేందర్ రెడ్డి తాజాగా చెప్పుకొచ్చారు. సైరా నరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ బల్గేరియాలో జరిగిందని సాధారణంగా సినిమాల కోసం సెట్స్ వేస్తామని అయితే సైరా సినిమాకు పని చేసేవాళ్ల కొరకు సెట్స్ వేశామని సురేందర్ రెడ్డి తెలిపారు. బల్గేరియాలో గాలి వల్ల షూటింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని ఎడారిలా ఉండే ఆ ప్రాంతంలో ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఉంచడం కొరకు చరణ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు బాత్ రూమ్, బెడ్ రూమ్స్ వచ్చేలా రూమ్స్ ఏర్పాటు చేయాలని సూచించారని ఇందుకోసం చరణ్ భారీ మొత్తంలో ఖర్చు చేశారని సురేందర్ రెడ్డి తెలిపారు.

గుర్రాల కోసం 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి చరణ్ షెడ్డు వేయించారని సురేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. స్టార్ హీరో రామ్ చరణ్ కు మాత్రమే అంత శ్రద్ధ తీసుకోవడం సాధ్యమవుతుందని సురేందర్ రెడ్డి కామెంట్లు చేశారు. వేరే వాళ్లు అయితే అంత శ్రద్ధ తీసుకోరని సురేందర్ రెడ్డి వెల్లడించారు. చరణ్ గొప్పదనం గురించి చెబుతూ సురేందర్ రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చరణ్ ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus