తండ్రి చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సుష్మిత!

  • December 19, 2017 / 12:36 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. చిరంజీవి గత చిత్రం ఖైదీ నంబర్ 150 సినిమాకి సుష్మిత  కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు. అందులో తండ్రిని చాలా యంగ్ గా చూపించారు. సైరా కోసం గంభీరమైన ఆనాటి దుస్తులను డిజైన్ చేయిస్తున్నారు. ఆ  సినిమా గురించి వివరిస్తూ తండ్రి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. “నాన్న రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలకు దాదాపు దూరమయ్యారు.

నిత్యం షూట్‌లతో బిజీగా ఉండే నాన్న.. ఒక్కసారిగా సినిమాలకు దూరం అవడంతో ఆయనలో సంతోషం దూరమైంది. షూటింగ్‌లు లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎంతమాత్రం ఇష్టపడే వారు కాదు. మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనలో పాత చిరంజీవిని చూస్తున్నాము. ఆయన మొహంలో మునుపటి సంతోషాన్ని చూస్తున్నాము” అని సుష్మిత చెప్పారు. రీ ఎంట్రీ అప్పుడు కొంత ఆందోళనగా కనిపించిన చిరు… ఖైదీ నంబర్ 150 హిట్ కావడంతో మరింత ఉత్సాహంతో సైరా నరసింహారెడ్డి చేస్తున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus