‘సాహో’ కు భయపడుతున్న అజిత్ టీమ్?

  • June 17, 2019 / 06:04 PM IST

‘బాహుబ‌లి’ త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత దాదాపు రెండేళ్ళ గ్యాప్ తర్వాత `సాహో` వంటి మరో యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుంది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో భారీగా విడుదల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

ప్యాన్ ఇండియా మూవీ కావడంతో ఈ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. ఇక్కడి వరకూ బానే ఉంది కానీ తమిళ్ మాత్రం ‘సాహో’ కి దెబ్బ పడేలా ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ మూవీ `పింక్` రీమేక్‌) చిత్రాన్ని ఆగ‌స్ట్ 10న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసారు. సరిగ్గా ఐదు రోజుల వ్య‌వ‌ధిలోనే `సాహో` చిత్రం విడుద‌లవుతుండ‌టంతో ఆ ఎఫెక్ట్ త‌మ‌ సినిమా పై ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని భావించి అజిత్ సినిమా ద‌ర్శ‌క నిర్మాత‌లు ‘నేర్కొండ పార్వై’ చిత్రాన్ని జూలై నెల‌లోనే విడుద‌ల చేస్తే బెటర్ అనే ఉద్దేశంతోనే చిత్ర యూనిట్ ఉందట. మరి చివరికి ఏం జరుగుద్దో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus