సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ చేసిన చిరంజీవి!

  • October 27, 2017 / 01:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే దానిపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడుతారు. అభిమానుల అంచనాలకు మించి ఉండాలని ప్లాన్ వేస్తారు. ఇక ప్రతి భారతీయుడు గర్వపడే తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని తెరకెక్కించాలంటే మరింత హోమ్ వర్క్, ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే చిరు 151 వ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి ఆలస్యమవుతోంది. ఆగస్టులో  లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ సెప్టెంబర్, అక్టోబర్ లో మొదలవుతుందని చెప్పుకొచ్చారు. కానీ చివరికి అది నవంబర్ దాటి డిసెంబర్ కి వెళ్ళింది. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో ఈ సినిమా కోసం అలనాటి వాతావరణానికి సంబంధించిన సెట్స్‌ వేస్తున్నారు.

ఇది మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీలకరోల్ పోషించనున్నారు. హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతానందిస్తున్న ఈ సినిమాని అనేక భాషల్లో రిలీజ్ చేయాలనీ నిర్మాత రామ్ చరణ్ తేజ్ భావిస్తున్నారు. 2019  సంక్రాంతికి సైరా రిలీజ్ చేయాలనీ సంకల్పంతో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus