సైరాలో హైలెట్ కానున్న భారీ యాక్షన్ సీన్

  • October 9, 2018 / 07:14 AM IST

బాహుబలి తర్వాత ఆ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న మూవీ “సైరా నరసింహారెడ్డి”. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితాన్ని డైరక్టర్ సురేందర్ రెడ్డి కళ్లకుకట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజాగా “జార్జియా”లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మొన్నటి వరకు బ్రిటిష్ సైనికులపై షాట్స్ కంప్లీట్ చేయగా.. నిన్న చిరంజీవి, విజయ్ సేతుపతి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. బ్రిటిష్ సైన్యానికి, సైరా నరసింహ రెడ్డి అనుచరుల తో సాగే ఈ యుద్ధ సీన్ సినిమాలోనే హైలెట్ కానుంది.

ఈ ఒక్క షెడ్యూల్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. నెల రోజులపాటు షూటింగ్ సాగనున్నట్టు సమాచారం. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకరోల్ పోషిస్తోన్న ఈ చిత్రంలో సైరాకి మొదటి భార్యగా నయనతార, రెండో భార్య గా హ్యూమా ఖురేషి, మూడో భార్యగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. ఇక తమన్నా ఒక పోరాట వనితగా కనిపించనుంది. అలాగే మెగా ప్రిన్సెస్ నిహారిక గిరిజన అమ్మాయిగా చిన్నరోల్ చేస్తోంది. ఎక్కువమంది స్టార్స్ నటిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus