కరోనా భారిన పడినా తమన్నా తల్లి దండ్రులు…!

  • August 26, 2020 / 05:13 PM IST

కరోనా ఇప్పుడు సినీ సెలబ్రిటీలను కూడా టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. నిర్మాత బండ్ల గణేష్ , రాజమౌళి, రామా రాజమౌళి, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, …సింగర్ సునీత, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం … ఇలా చాలా మంది కరోనా భారిన పడ్డారు. దీంతో సినీ పరిశ్రమలో ఉన్న వారంతా భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా… తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా భారిన పడినట్టు సమాచారం.

వివరాల్లోకి వెళితే…తమన్నా తల్లిదండ్రులకు కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తమన్నా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. లాస్ట్ వీక్ తన తల్లిదండ్రుల్లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించాయని.. ఇంట్లో వాళ్ళంతా.. ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు చేయినచుకున్నారట.

‘ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి…..దురదృష్టవశాత్తు నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ గా తేలింది.కానీ నాకు అలాగే మిగిలిన నా కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది’ అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తమన్నా కి తన అభిమానులు ధైర్యం చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus