మెగా అభిమానులను ఖుషీ చేసిన తనికెళ్ళ భరణి..!

  • June 11, 2019 / 04:42 PM IST

మెగా అభిమానూలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’. మెగాస్టార్ 151 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలయ్యి సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసింది. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ పెద్దగా ఏమీ బయటకి రావడం లేదు. అయితే మొదటిసారి నటుడు తనికెళ్ళ భరణి.. ‘సైరా’ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు.

ఇటీవల తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళిన.. ఆయన దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడారు. తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. ” ‘సైరా’ చిత్రం తెలుగు వాళ్ళందరూ గర్వపడేలా ఉంటుంది.. తెలుగు ఖ్యాతిని పెంచేలా ఉంటుంది. మెగా అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమా సిద్ధమవుతోంది. ‘కష్టే ఫలి’.. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది కాబట్టి సినిమా ఆలస్యమవుతున్నందుకు చింతించవద్దు. ‘సైరా’ సినిమా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. ఈ చిత్రంలో నా పాత్ర సినిమాలో అద్భుతంగా ఉంటుంది. అలాగే నేను దర్శకత్వం వహించబోయే చిత్రం కూడా ఆగష్టులో మొదలవుతుంది” అంటూ తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus