సామ్రాట్ తో తనకున్న బంధాన్ని చెప్పిన తేజస్వి!

  • July 25, 2018 / 02:05 PM IST

ఇంకొంచెం మసాలా.. అనే ట్యాగ్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 2 షో.. అంతే మసాలాతో సాగుతోంది. నలభై ఐదు రోజులుగా తెలుగు రాష్ట్రాల బుల్లి తెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన జంట సామ్రాట్, తేజస్వి. అప్పుడే ప్రేమలో పడిన ప్రేమ పక్షుల్లా హౌస్ మొత్తం విహరించారు. గంటకో కౌగిలింత.. గంటల తరబడి కబుర్లు.. వీరిని చూసిన వారందరూ ప్రేమలో పడిపోయారని భావించారు. హఠాత్తుగా తేజస్వి హౌస్ నుంచి బయటికి వచ్చింది. దీంతో వీరి లవ్ ట్రాక్ కి బ్రేక్ పడింది. మళ్ళీ బిగ్ బాస్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని హౌస్ లోకి వెళ్ళడానికి అభిమానుల మద్దతు కోరుతోంది.

అందుకే పేస్ బుక్ లైవ్ లోకి వచ్చి రిక్వెస్ట్ చేస్తోంది. ఈ లైవ్ లో మాట్లాడుతూ సామ్రాట్ తో తనకున్న బంధం పై క్లారిటీ ఇచ్చింది. “అందరూ సామ్రాట్ కు.. నీకు మధ్య ఏముంది? అని అడుగుతున్నారు. మా మధ్య ఏమీ లేదు. ఆయన ఒక మంచి మనిషి .. అలాగే తనీశ్ కూడా. మంచి మనుషులంతా కలిస్తే ఫ్రెండ్స్ అవుతారు. వాళ్లని ఒక టీమ్ అనొచ్చు .. మరేదైనా అనొచ్చు. షోలో సామ్రాట్ కనిపించడం లేదు .. నన్నే ఎక్కువగా చూపించారు. నేను అరవడం, తిట్టడం, నా గురించి వేరేవాళ్లు మాట్లాడుకోవడం చూపించారు. తిరిగి ‘బిగ్ బాస్ హౌస్’లోకి వెళ్లాలనుకుంటున్నాను .. అది మీ చేతుల్లోనే ఉంది” అని చెప్పింది. మరి ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఎవరు ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus