కైరా అద్వానీని కన్సిడర్ చేయని తెలుగు దర్శకులు 

  • February 16, 2019 / 12:54 PM IST

“భరత్ అనే నేను” సినిమా తర్వాత కైరా అద్వానీ క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. అందరూ ఆ అమ్మాయే కావాలి అనుకున్నారు. కానీ.. “వినయ విఢేయ రామ” డిజాస్టర్ అనంతరం ఆమెను అప్రోచ్ అవ్వడం అటుంచి కనీసం ఆమెను పట్టించుకోవడం కూడా మానేశారు. ప్రస్తుతం ఆమె చేతిలో కేవలం ఒకే ఒక్క బాలీవుడ్ ప్రొజెక్ట్ ఉంది. అది కూడా “వినయ విధేయ రామ” విడుదలకు ముందు సైన్ చేసిన సినిమా కావడం గమనార్హం.

తొలుత అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కథానాయికగా కైరా అద్వానీని కథానాయికగా అనుకుంటున్నట్లుగా టాక్ వినిపించినప్పటికీ.. ఇప్పుడు ఆమె స్థానంలో రష్మిక మండన్న, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తుండడంతో కైరా ప్లేస్ ఫైనల్ అవ్వలేదని స్పష్టమవుతూనే ఉంది. మరి ఆమెకు ఇప్పుడు అర్జెంట్ గా సినిమా అవకాశం ఇచ్చే హీరో లేదా దర్శకుడు ఎవరో తెలియాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus