వేణు స్వామి పై తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ కు పిర్యాదు చేసిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్

  • August 12, 2024 / 06:16 PM IST

సోషల్ మీడియా లో ఫిల్మ్ సెలబ్రిటీస్ పై వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ అయిన వేణు స్వామి ఈ మధ్య జరిగిన అక్కినేని నాగచైతన్య – శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ రోజున వారి జాతకాలను విశ్లేషణ చేస్తూ చేసిన వీడియో పెనుధుమారం లేపింది.

అసలు వ్యక్తి గత విషయాలు నలుగురి లో మాట్లాడ కూడదు అనే ఇంగిత జ్ఞానం కూడ లేని వేణుస్వామి వాళ్ళు ఎప్పుడు విడి పోతారో కూడా చెప్పేసాడు.

గతం లో సినిమా రిలీజ్ లపై, రాజకీయ ఫలితాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేసి అభాసు పాలు అయినా కూడ బుద్ది రాని వేణుస్వామి నాగ చైతన్య – శోభిత లపై అలాంటి వ్యాఖ్యలే చేసాడు.

అతనిపై చర్యలు తీసుకోవాలి అని కోరుతూ..

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మరియి తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారికి కలిసి పిర్యాదు చేసారు.

ఈ విషయం పై స్పందించిన ఛైర్ పర్సన్ శ్రీమతి నీరెళ్ల శారద గారు వేణుస్వామి పైన మరియు టెలికాస్ట్ చేసిన యూట్యూబ్ చానల్స్ పైన తప్పకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు.

వేణుస్వామి ని పిలిపించి అతని వివరణ అడుగుతామని అన్నారు.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్
లక్షినారాయణ, జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు,
ట్రైజరర్ సురేంద్ర కుమార్ నాయుడు, ప్రసాదం రఘు, లక్ష్మీ (V6),తో పాటు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ నుండి ప్రెసిడెంట్ ప్రేమమాలిని వనం, సెక్రటరీ వేదుల మూర్తి, మెంబెర్స్ సువర్ణ, తేజస్విని సజ్జ, భాగ్యలక్ష్మి, యస్.కుమార్ మరియు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus