అజిత్ ఫ్యాన్స్ కు ఇదో పెద్ద సర్ప్రైజ్ ..!

  • April 5, 2019 / 07:00 PM IST

కోలీవుడ్లో అజిత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సంక్రాంతికి రజినీ కాంత్ ‘పెట్ట’ చిత్రంతో పోటీగా అజిత్ ‘విశ్వాసం’ సినిమా విడుదలయ్యింది. అజిత్ ను మించి రజినీ పెద్దస్టార్ కాబట్టి ఆ చిత్రమే పెద్ద హిట్టవుతుందని.. ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘విశ్వాసం’ చిత్రం అతధిక వసూళ్ళను సాధించింది. అంతేకాదు తమిళ చిత్రాల్లో ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రం కూడా ‘విశ్వాసం’ అని చెప్పడంలో సందేహం లేదు. నిజానికి ‘విశ్వాసం’ కూడా రొటీన్ మాస్ సినిమానే. అయినప్పటికీ రజినీ చిత్రాన్ని మించి కలెక్షన్లు రాబట్టడం ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ప్రస్తుతం అజిత్ క్రేజ్ ఎలాంటిదనేది ఈ ఒక్క చిత్ర విజయంతో చెప్పొచ్చు. అంతటి స్టార్ హీరో తరువాత చిత్రం కేవలం 40 రోజుల్లో పూర్తయిపోయిందట.

బాలీవుడ్ లో సూపర్ హిట్ సాధించిన ‘పింక్‌’ చిత్రాన్ని తమిళ్ లో ‘నేర్‌కొండ పార్వై’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ పోషించిన లాయర్ పాత్రను తమిళ్ లో అజిత్‌ చేస్తున్నాడు. తాప్సి పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తుంది. ‘ఖాకి’ వంటి డీసెంట్ హిట్ ఇచ్చిన వినోద్‌ డైరెక్షన్లో ఈ రీమేక్ తెరకెక్కుతుంది. ఫిబ్రవరి మూడో వారంలో మొదలైన ఈ చిత్రం ఏప్రిల్‌ మొదటి వారానికే పూర్తయ్యిపోయిందట. సాధారణంగా అజిత్ చిత్రమంటే.. ఓ స్టార్ హీరోయిన్ తో పాటూ స్టార్ క్యాస్టింగ్ ఉంటుందనేది తెలిసిన సంగతి. వారి డేట్స్ కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎంతకాదనుకున్నా ఏడాది షూటింగ్ జరపాల్సి ఉంటుంది. కానీ ‘నేర్‌కొండ పార్వై’ చిత్రం కేవలం 40 రోజుల్లో పూర్తవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ చిత్రం రీమేక్ కావడం.. స్క్రిప్టు పక్కాగా రెడీగా ఉండడంతో… శరవేగంగా షూటింగ్ పూర్తి చేసేశాడు డైరెక్టర్ వినోద్. అజిత్ కెరీర్లోనే కాదు ఓ స్టార్ హీరో కెరీర్లో కూడా ఇంత వేగంగా మరే చిత్రం పూర్తయ్యుండదేమో..! ఇక ఈ చిత్రాన్ని శ్రీదేవి భర్త బోణీ కపూర్ నిర్మించాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus