‘పెనిమిటి’ పాటపై అమ్మ అభినందనను పంచుకున్న థమన్

  • September 20, 2018 / 01:11 PM IST

ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఇప్పటి వరకు ఎన్నో పాటలకు అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారు. ఎస్ ఎస్ థమన్ జాబితాలోనూ ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకోసం రామజోగయ్య శాస్త్రి రాసిన పాట చాలా కాలం గుర్తుండిపోతుంది. ఆతని సాహిత్యానికి థమన్ ఇచ్చిన ట్యూన్ గుండెల్ని మెలిపెడుతోంది. కాల భైరవ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. ఈ పాట నిన్న రిలీజ్ అయి అందరితో కన్నీరు పెట్టిస్తోంది. పాట విని కన్నీరు పెట్టుకున్న వారిలో థమన్ తల్లి ఉండడం విశేషం.

“మా అమ్మ `పెనివిటి` పాట విని నన్ను తన గదిలోకి పిలిచింది. లోపలికి వెళ్లగానే నన్ను పట్టుకుని ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లతో నా షర్టు మొత్తం తడిచిపోయింది. ప్రపంచంలో అమ్మ కంటే గొప్పది ఏదీ లేదు” అని తమన్ ట్వీట్ చేశారు. అలాగే తల్లితో ఉన్న ఫోటోని షేర్ చేసారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇస్తుండగా.. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ తో పాటు సెంటిమెంట్ సీన్లు కూడా ఎక్కువగానే ఉండనున్నాయని అర్ధమవుతోంది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ అక్టోబర్ 11న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus