The RajaSaab: టీమ్‌ కష్టం ఫలించిందా? కొలిక్కి వస్తున్న ‘రాజా సాబ్‌’ ఓటీటీ డీల్‌!

‘రాజా సాబ్‌’ (The RajaSaab) సినిమా ఎంతవరకు వచ్చింది, ఎలా షూటింగ్‌ చేస్తున్నారు, ఎక్కడ షూటింగ్‌ చేస్తున్నారు? ఇలా చాలా ప్రశ్నలు చాలా రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే సినిమా షూటింగ్‌ అప్‌డేట్స్‌ మారుతి టీమ్‌ నుండి రాలేదు. సినిమా నిర్మాణ సంస్థ కూడా ‘మేం రెడీ అయ్యామంటే మా కోసం ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే’ అంటూ ఎలివేషన్లు ఇచ్చారు. రీసెంట్‌గా డిసెంబరులో రిలీజ్‌ అంటూ ప్రకటించారు.

The RajaSaab

దీంతో ఇప్పట్లో సినిమా అప్‌డేట్‌లు కష్టమే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా టీజర్‌ రిలీజ్‌ చేశారు, సినిమా సెట్స్‌కి మీడియా విజిట్‌ పెట్టారు.ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? సినిమా రిలీజ్‌కి ఆరు నెలల ముందు, అందులో ఎప్పుడు ప్రభాస్‌ (Prabhas) డేట్స్‌ ఇస్తాడు అనేది కూడా తెలియదు. ఈ సందర్భాల్లో ప్రచారం ఎందుకు స్టార్ట్‌ చేశారు అనే డౌటనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది.

మరి దీనికి, ఇప్పుడు టీమ్‌ నుండి వస్తున్న లీకులకు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ.. సినిమా ఓటీటీ డీల్‌ దాదాపు పూర్తయింది అని సమాచారం. చాలా నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఒప్పందంపై ఓ పెద్ద ఓటీటీ సంస్థ, నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని సమాచారం. మామూలుగా ఏదైనా పెద్ద హీరో సినిమా ఓటీటీ డీల్‌ సినిమా ముహూర్తం షాట్‌ కొట్టిన వెంటనే ఓకే అయిపోతున్నాయి. ఇంకొన్ని సినిమాలకైతే ఫస్ట్‌ లుక్‌కి ఓకే అవుతున్నాయి.

కానీ ‘రాజా సాబ్‌’ (The RajaSaab) సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్‌ ఇంకా ఓకే అవ్వలేదు. ఈ మేరకు ఎక్కడా ఎలాంటి లీకులు కూడా లేవు. మొన్న రిలీజ్‌ చేసిన పోస్టర్లలో కూడా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఓటీటీ డీల్‌ని స్పీడప్‌ చేయడానికే ఎర్లీ ప్రచారం అనే ప్రచారం సాగింది. రీసెంట్‌ ప్రచారంలో మొత్తంగా అరడజను మంది పీఆర్‌ టీమ్‌ పని చేశారని సమాచారం. ఏదైతేముంది ఇప్పుడైతే ఓటీటీ డీల్‌ ఓకే అయిందట.

అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus