కారణం చెప్పకుండా… రూమర్స్‌కు అవకాశమిచ్చాడుగా

  • December 23, 2020 / 07:18 PM IST

టాలీవుడ్‌లో నిన్న రాత్రి 8.30కి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. దానికి కారణం మంచు విష్ణు. ‘చిరంజీవి అంకుల్‌ కలిశాను’ అంటూ మంచు విష్ణు తన ఐఫోన్‌ నుంచి ట్విటర్‌లో ఓ ఫొటో చేశాడు. అందులో అంత ఇంట్రెస్ట్‌ ఏముంది అంటారా? మామూలుగా అయితే ఈ ఇద్దరూ కలిస్తే పెద్ద విషయం కాదు. కానీ ఆ ట్వీటులో ‘నేనెందుకు అంకుల్‌ని కలిశానో’ త్వరలో చెబుతా అంటూ ఓ మెలిక పెట్టాడు విష్ణు. ఇప్పుడు అదే చర్చలు, ఉపచర్చలకు దారి తీస్తోంది. అసలు ఎందుకు కలిశాడు.. కారణమేంటి అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో కొన్ని మీకోసం….

చిరంజీవి – మోహన్‌బాబు మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ స్టేజీ ఎక్కితే పొగడ్తలు, తెగడ్తలు కామన్‌. ఏంటిది అనుకునేలోపే ఓ హగ్గు ఇచ్చి, ఆప్యాయతతో చిన్న ముద్దు కూడా ఇచ్చుకుంటారు. అలాంటి మోహన్‌బాబు కొడుకు చిరంజీవి కలవడం, అందులోనూ ఒక్కడే కలవడం కొత్త కాదు. అయితే ఎందుకు కలిశాడనేదే ఇక్కడ విషయం. ఈ కలయిక వెనుక రెండు కారణాలున్నాయని టాలీవుడ్‌ ట్విటర్‌ టాక్‌.

చిరంజీవి త్వరలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నాడు. అందులో ఓ పాత్ర కోసం విష్ణును తీసుకుంటారని టాక్‌ వినిపిస్తోంది. మాతృక పృథ్వీరాజ్‌ సుకుమార్‌ చేసిన పాత్ర కోసం విష్ణును తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇది కాకుండా రెండోది విష్ణు ‘మోసగాళ్లు’. ఎంతో ప్రతష్ఠాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరును ఆహ్వానించడానికే విష్ణు వెళ్లాడనే టాక్‌ వినిపిస్తోంది. ఇది కాకుండా ఆ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని చిరును విష్ణు కోరాడనే టాక్‌ కూడా అక్కడక్కడా వినిస్తోంది. చూద్దాం ఇందులో ఏది నిజమవుతుందా? లేక పైవేవీ కావంటూ కొత్త అంశం తెర మీదకు తెస్తారో?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus