స్పీడ్ పెంచిన డార్లింగ్ అప్పుడే ‘ఆది పురుష్’ కు కూడా స్కెచ్..!

  • November 14, 2020 / 02:29 PM IST

‘రాధే శ్యామ్’ చిత్రం ఇటలీ షెడ్యూల్ ను పూర్తి చేసిన డార్లింగ్‌ ముంబైలో ల్యాండ్ అయ్యాడు. ‘హైదరాబాద్‌ రాకుండా అక్కడేం చేస్తున్నట్టు?’ అనే డౌట్ అందరిలోనూ ఉంది. ఫ్రెండ్స్ తో పార్టీలు వంటివి ప్లాన్ చేసుకున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ అలాంటివేమీ కాదు.’రాధే శ్యామ్’ ను మరో రెండు షెడ్యూల్స్ లో పూర్తి చెయ్యడానికి ప్లాన్ చెయ్యడంతో పాటు ‘ఆదిపురుష్’ ‌ను మొదలుపెట్టడానికి ప్లానింగ్ కూడా చేస్తున్నాడట ప్రభాస్.

ఇందుకు గాను దర్శకుడు ఓం రౌత్ తో‌ కలిసి ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో పాల్గొంటున్నాడని టాక్. అంతేకాదు ప్రభాస్ పాత్రకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా జరుగుతుందట. ‘ఆది పురుష్’ కు ప్రభాస్ ఇచ్చిన కాల్షీట్లు 70రోజులు మాత్రమేనట. ఎక్కువగా వి.ఎఫ్.ఎక్స్ పార్ట్ ఉంటుంది కాబట్టి.. చిత్రీకరణ మొత్తం గ్రీన్ మ్యాట్ లోనే సాగుతుందట. ఇక ఈ చిత్రం పనులతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రం కోసం అమితాబ్ బచ్చన్ తో కూడా ప్రభాస్ డిస్కషన్లు జరుపుతాడట.

అందుకోసం నాగ్ అశ్విన్ అలాగే అశ్వినీ దత్ లు కూడా ముంబై కు వెళ్ళబోతున్నారని సమాచారం. అబ్బో ఏమైనా ప్రభాస్ స్పీడ్ మాత్రం మామూలుగా లేదు. ఇక ‘ఆది పురుష్’ చిత్రాన్ని టి.సిరీస్ వారు 600కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు. రావణుడి పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ను ఇప్పటికే సెలెక్ట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus