Chiranjeevi, Kathi Mahesh: మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదేనా?

  • July 12, 2021 / 06:25 PM IST

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ శనివారం రోజు మృతి చెందగా కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే. నాని, శేఖర్ కమ్ములతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేయగా కొంతమంది మాత్రం కత్తి మహేష్ పై ఉన్న కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం కత్తి మహేష్ మృతి గురించి స్పందించలేదు.

చిరంజీవి సైలెన్స్ కు పవన్ ఫ్యాన్స్ కారణమని అందువల్లే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కత్తి మహేష్ మృతి గురించి స్పందించడానికి చిరంజీవి ఇష్టపడలేదని తెలుస్తోంది. పవన్ పై గతంలో కత్తి మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై దాడి చేశారని కూడా గతంలో వార్తలు వచ్చాయి.

శేఖర్ కమ్ముల కత్తి మహేష్ మృతి గురించి స్పందించినందుకు పవన్ ఫ్యాన్స్ ఆయనను కూడా ట్రోల్ చేశారు. చిరంజీవి ట్రోలింగ్ ను దృష్టిలో ఉంచుకునే కత్తి మహేష్ కు సంతాపం తెలియజేసే విషయంలో సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవి పెద్దమనిషి తరహాలో వ్యవహరించి కనీసం కత్తి మహేష్ కు ఆత్మశాంతి చేకూరాలని ట్వీట్ చేసినా బాగుండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus