థియేటర్స్ లో ముందుగా దిగేది పవనేనా ?

  • July 20, 2020 / 05:20 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలోకి తన కమ్ బ్యాక్ గ్రాండ్ గా ప్రకటించారు. ఆయన ఏకంగా మూడు చిత్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాటిలో వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా వైరస్ లేకుంటే వకీల్ సాబ్ ఇప్పటికే థియేటర్స్ లో దిగేది. పవన్ ఫ్యాన్స్ ఆశలపై లాక్ డౌన్ నీళ్లు చల్లింది. ఐతే స్టార్ హీరోలలో ముందుగా దిగేది పవన్ కళ్యాణ్ మాత్రమే అని తెలుస్తుంది. కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా…

త్వరోనే షూటింగ్ మొదలుపెట్టాలని దిల్ రాజు అనుకుంటున్నారట. వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ వకీల్ సాబ్ ఇండోర్ షూటింగ్ కావడంతో షూటింగ్ మొదలుపెట్టనున్నారని సమాచారం. పవన్ పై మిగిలిన కోర్ట్ రూమ్ సన్నివేశాలు, శృతి హాసన్ తో ఓ సాంగ్ మరియు కాంబినేషన్ సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. వాటి చిత్రీకరణ పూర్తి చేసి..పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మొదలుపెట్టాలి అనేది నిర్మాత దిల్ రాజు ఆలోచనగా తెలుస్తుంది. మూవీని పూర్తి చేసి వుంచిన పక్షంలో, థియేటర్స్ తెరుచుకున్న వెంటనే విడుదల చేయవచ్చు అనేది ఆయన ఆలోచనగా తెలుస్తుంది.

ఇక హిందీ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నారు.a

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus