Radhe Shyam Movie: ప్రభాస్ రాధేశ్యామ్ అలా ఉండబోతుందా?

  • August 28, 2021 / 09:19 AM IST

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా మూవీగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని గతంలో వార్తలు వచ్చాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం రాధేశ్యామ్ లో విజువల్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయని తెలుస్తోంది.

పాటలతో పాటు కొన్ని సీన్స్ లోని విజువల్స్ మరో ప్రపంచానికి తీసుకెళతాయని సమాచారం. సరికొత్త టెక్నాలజీని వినియోగించి రాధేశ్యామ్ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో మేకర్స్ ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటిస్తున్న తొలి సినిమా రాధేశ్యామ్ కాగా క్లాస్ ఎంటర్టైనర్ గా పునర్జన్మల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన రాధేశ్యామ్ ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మేకర్స్ త్వరలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశాల్లోనే రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఎక్కువగా జరగడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus