Akhanda: అఖండ సీక్వెల్ విషయంలో ఇబ్బందులు ఇవే.. ఏం జరిగిందంటే?

  • January 30, 2024 / 10:38 AM IST

2021 సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదలైన అఖండ మూవీ ఏ రేంజ్ లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బాలయ్య, బోయపాటి శ్రీను బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశారనే చెప్పాలి. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా అప్పట్లో 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. బాలయ్య అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది.

అయితే అఖండ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుండగా ఈ సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా అఖండ సీక్వెల్ అని సమాచారం. అయితే అఖండ1 కు మిర్యాల రవీందర్ రెడ్డి కావడంతో ఆ నిర్మాత నుంచి అఖండ సీక్వెల్ కు సంబంధించి క్లియరెన్స్ రావాల్సి ఉందని అందుకే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించలేదని తెలుస్తోంది.

అఖండ (Akhanda) సీక్వెల్ విషయంలో ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సూర్య బోయపాటి శ్రీను, బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్లకు సంబంధించి కూడా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బోయపాటి శ్రీను ప్లానింగ్ ఎలా ఉందో చూడాల్సి ఉంది. తన డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమా 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతుందని ఇప్పటికే బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చేశారు.

బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను పారితోషికం ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. బోయపాటి శ్రీను భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్కంద సినిమా విషయంలో చేసిన తప్పులు భవిష్యత్తులో రిపీట్ కాకుండా బోయపాటి శ్రీను జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus